రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ షాపులను పునః ప్రారంభం చేసిన మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు. కంచికచర్ల పట్టణంలో ఆదివారం నాడు కూటమి నాయకులు రెవెన్యూ అధికారులతో కలిసి పలు రేషన్ దుకాణాలను మండల టిడిపి అధ్యక్షుడు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎంపిటిసి సభ్యులు కోగంటి బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కోగంటి బాబు మాట్లాడుతూ రేషన్ కార్డు లబ్దిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అన్ని నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందేలా చూడాలని సూచించారు. వికలాంగులకు వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు పంపిణీ చేయాలని ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసుకోవాలని రేషన్ డీలర్ కు ఆదేశించారు. సాంకేతిక సమస్య వచ్చినప్పుడు లబ్ధిదారులు రేషన్ డీలర్ కి సహకరించాలని వారిని కోరారు.రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేయాలనే దృష్టితో తీసుకున్న ఈ చర్యలు ప్రజల జీవనోపాధికి ఊతమిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు కూటమి నాయక