కంచికచర్ల రామాలయం, శివాలయం లో ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి, కళ్యాణం మహోత్సవం కార్యక్రమం
News Image

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల

హనుమాన్ జయంతి సందర్భంగా కంచికచర్ల పట్టణంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి రామాలయంలో, శివాలయం లో గురువారం ఉదయం నుంచి స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగిందని అలయ అర్చకులు తారంబాబు, కాకాని హనుమాత్ సుమన్ శర్మ, కాకాని పవన్ బాబీ తెలియజేశారు . పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఉదయం నుంచి హనుమాన్ చాలీసా పారాయణము లో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆంజనేయస్వామి వారి కళ్యాణం మహోత్సవాని భక్తులు తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించండం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మంచినీరు సరఫరా చేసారు.