Wednesday, April 9, 2025
spot_img
Homeక్రైమ్ న్యూస్నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన నుంచి బాలుడి కిడ్నాప్ BHS NEWS

నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన నుంచి బాలుడి కిడ్నాప్ BHS NEWS

నిజామాబాద్, ఈవార్తలు : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు. జిల్లాలోని మాక్లూర్ మండలం మానిక్ భండార్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం దవాఖానకు తీసుకొచ్చాడు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితో కలిసి దవాఖానలోని కారిడార్‌లో పడుకున్నారు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా, గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్రలేచిన తండ్రి.. తన పక్కన కొడుకు కనిపించకపోయే సరికి దవాఖాన అంతటా వెతికాడు. ఎక్కడా కనిపించక పోవటంతో దవాఖానలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు.

వెంటనే ఒకటో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. దవాఖానలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. బాలుడిని ఎటువైపు తీసుకువెళ్లారన్న విషయాన్ని తెలుసుకోవడానికి దవాఖాన పరిసరాల్లో, బస్టాండ్, పట్టణంలోని పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఐఏఎస్ అధికారికి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి.. సినిమాలు తీయడమే కష్టమంటూ వ్యాఖ్య
గోరింటాకు ఆరోగ్యాన్ని పెంచే అద్భుతం!

Hashtags: #crime news #Nizamabad News

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Social Media Auto Publish Powered By : XYZScripts.com